సిద్ధిపేట జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి వాటిని తీర్చేందుకు ఓ కానిస్టేబుల్ తన భార్యతో కలిసి దారుణానికి ఒడిగట్టారు. అప్పు ఇచ్చిన వ్యాపారి తిరిగి డబ్బులు చెల్లించాలని అడగటంతో వాటిని తీర్చే మార్గం లేక అతడిని నమ్మించి శివార్లకు తీసుకెళ్లి గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేసి.. వ్యాపారి ఒంటిపై ఉన్న బంగారాన్ని అమ్ముకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కానిస్టేబుల్ దంపతులను అరెస్ట్ చేయగా.. వీరు గతంలోనూ పలు నేరాలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.