దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడులను కలుపుతూ మూడు భారీ హైస్పీడ్ రైల్ కారిడార్ల నిర్మాణానికి రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. గంటకు 600 కి.మీ. వేగంతో ప్రయాణించే విధంగా వీటి డిజైన్లలో మార్పులు చేయాలని ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ ఆదేశించింది. హైదరాబాద్- అమరావతి- చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై- బెంగళూరు మార్గాల్లో ఎలైన్మెంట్లు ఖరారవుతున్నాయి. వీటి ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా పారిశ్రామిక, పర్యాటక రంగాలకు ఊతం లభించనుంది.