హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ బోరబండ సర్కిల్ టౌన్ ప్లానింగ్ జూనియర్ అసిస్టెంట్ శ్రీలత, భవన నిర్మాణ అనుమతుల కోసం రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. బాధితుడు వెంకటేష్ నుంచి మొత్తం రూ. 5 లక్షలు డిమాండ్ చేసిన ఆమె.. అడ్వాన్స్ తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో దాడి నిర్వహించగా.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. నిందితురాలిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు రిమాండ్కు తరలించారు.