బస్సులో నుంచి తల బయటకుపెట్టిన విద్యార్థి.. ఇంతలోనే ఎంత ఘోరం

4 months ago 34
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోరం జరిగింది. ముమ్మిడివరం మండలంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థి అజాగ్రత్త కారణంగా జరిగిన ఈ దుర్ఘటన.. స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల వెల్లడించిన కథనం ప్రకారం.. అన్నంపల్లి శివారు లక్ష్మీదేవీలంకకు చెందిన సోంపల్లి వెంకట రవీంద్ర అనే 16 ఏళ్ల విద్యార్థి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. బుధవారం రోజ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో.. అన్నంపల్లి టోల్ ప్లాజా సమీపంలో బస్సు కిటికీ గుండా వెంకట రవీంద్ర.. తన తల బయటకు పెట్టాడు. దురదృష్టవశాత్తూ, అతని తల రోడ్డు పక్కన ఉన్న ఐరన్ పోల్‌కు తగిలింది.
Read Entire Article