జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోటి చెరువు శిఖం భూమిని కబ్జా చేశారని, దాన్ని వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పవన్ ఇటీవల చేసిన 'తెలంగాణ మీ అయ్య జాగీరా' అనే వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇది అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తమ జాగీరేనని స్పష్టం చేశారు. గద్దర్కు కారు కొనివ్వడంపై పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన ఆమె.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ భూదందాలను తీవ్రంగా విమర్శించారు.