బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు. బండి సంజయ్ కొడుకు చేసిన పనికి.. ఆయనకు ఏం సంబంధం లేదని తేల్చి చెప్పారు. బండి సంజయ్ బీజేపీ ఎంపీ అని.. కేంద్రమంత్రి అని.. కానీ ఈ వ్యవహారంలో బీజేపీ పార్టీకి ఏం సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు సంబంధించిన విషయాలను రాంచందర్ రావు వెల్లడించారు.