కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు విచారణలో జాప్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 8న ఫిర్యాదు వచ్చినా చర్యలు తీసుకోకపోవడంపై పోలీసులను ప్రశ్నించిన సీఎం.. తక్షణమే ప్రత్యేక బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాజకీయ విమర్శల నేపథ్యంలో విచారణ పారదర్శకంగా జరగాలని డీజీపీకి దిశానిర్దేశం చేశారు. మైనర్ బాలిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.