బండి భగీరథ్ పోక్సో కేసుపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాధిత బాలిక, బండి భగీరథ్ ఫ్రెండ్స్ లాగా, బావా మరదళ్ల లాగా ఉండేవారని పేర్కొన్నారు. ఇది వారి కుటుంబ సమస్య అని.. తెలంగాణ ప్రజలకు గానీ, బీజేపీకి గానీ ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. బాధితురాలు, ఆమె తల్లి కూడా బండి భగీరథ్తో చనువుగానే ఉన్నట్లు వైరల్ అవుతున్న వీడియోల ద్వారా అర్థం అవుతోందని తెలిపారు.