బండి భగీరథ్ పోక్సో కేసులో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కేంద్రమంత్రి బండి సంజయ్.. ఈ కేసులో ఏ2 నిందితుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్కి అన్నీ తెలిసినా.. తన కుమారుడిని కంట్రోల్ చేయలేదని తేల్చి చెప్పారు. బండి సంజయ్కి విషయం తెలిసినా.. పోలీసులకు చెప్పకుండా.. కుమారుడిని రక్షించేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.