ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాలలో గురువారం వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ద్రోణి ప్రభావానికి తోడు.. రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడుతుందని, వీటి కారణంగా రాయలసీమ జిల్లాలలో మంగళవారం వరకూ.. కోస్తాంధ్రలో గురువారం వరకూ పిడుగులతో కూడిన వానలు పడతాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.