తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. దేశ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో.. దేశ ప్రజలకు అలర్ట్ ఇచ్చారు. ఏడాది పాటు బంగారం కొనడం ఆపేయాలని హితవు పలికారు. అంతేకాకుండా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని కూడా తగ్గించాలని కోరారు. ప్రజా రవాణాను ఉపయోగించాలని సూచించారు.