తెలంగాణలోని అర్బన్ రీజియన్లలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రభుత్వం రికార్డు స్థాయి పరిహారం చెల్లిస్తోంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమీపంలోని కొంగర ఖుర్ద్, కొంగర కలాన్ గ్రామాల్లో ఫ్యూచర్ సిటీకి అనుసంధానంగా నిర్మించే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే కోసం ఎకరాకు గరిష్టంగా రూ.1.24 కోట్ల భారీ పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. రూ.4,600 కోట్లతో ప్రతిపాదించిన 300 అడుగుల ఈ రహదారి కోసం రెండు దశల్లో మొత్తం 1,500 ఎకరాలను సేకరిస్తున్నారు.