ఫ్యాబ్సిటీ భూ నిర్వాసిత రైతుల 22 ఏళ్ల పోరాటం ఫలించింది. కందుకూరు మండలం లేమూరులోని సర్వే నంబర్ 102లో అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించేందుకు రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు అంగీకరించారు. ఆరుగురు సీఎంలకు విన్నవించి, ఇటీవల మూడు నెలల పాటు దీక్షలు చేసిన రైతుల సమస్యను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో మార్గం సుగమమైంది. ఈ మేరకు 23 మంది సీలింగ్ పట్టాదారులకు 325 చ.గజాలు, కాస్తులో ఉన్న 148 మందికి 200 చ.గజాల చొప్పున ప్లాట్లు దక్కనున్నాయి. అయితే 38ఈ పట్టాదారుల సమస్య పరిష్కారం కావాల్సి ఉంది.