గత ప్రభుత్వ హయాంలో.. ప్రతిపక్షాలకు చెందిన నేతలతోపాటు సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలకు తెరతీశారు. తన ఫోన్ ట్యాప్ చేశారని కవిత ఎన్నోసార్లు చెప్పారని గుర్తు చేసిన ఎంపీ చామల.. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే హరీష్ రావు తన డ్రైవర్, పీఏను మార్చేశారని ఆరోపించారు. వేల ఫోన్లు ట్యాప్ చేసి.. ప్రైవేట్ సంభాషణలను విన్నారని మండిపడ్డారు.