ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. ఎమ్మెల్యే హరీశ్‌రావుకు నోటీసులు జారీ..

6 months ago 30
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) దూకుడు పెంచింది. ఈ దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2026, జనవరి 20న ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. వీసీ సజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల బృందం.. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణలో లభించిన సమాచారం, సాంకేతిక ఆధారాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు మాజీ అధికారులు పది నెలలుగా రిమాండ్‌లో ఉండగా.. కీలక నేతలకు నోటీసులు అందడం ఈ కేసులో అసలు సూత్రధారులను వేటాడే ప్రక్రియలో భాగమని స్పష్టమవుతోంది.
Read Entire Article