తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు, కొడంగల్ కాంగ్రెస్ నేత శ్రీరాం రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. నేడు ఆయన బషీర్బాగ్ పాత సీపీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి రాజకీయ, ఆర్థిక వ్యూహాలను తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్ అధికారులు శ్రీరాం రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారనే అనుమానంతో ఈ విచారణ జరగనుంది. అధికారులు ఆయన స్టేట్మెంట్తో పాటు సాంకేతిక ఆధారాలను సేకరించనున్నారు.