ఫేక్ సర్టిఫికెట్లతో అడ్వకేట్ల ప్రాక్టీస్.. తెలంగాణ బార్ కౌన్సిల్ సంచలన నిర్ణయం

1 year ago 25
తెలంగాణ బార్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేక్ సర్టిఫికెట్లతో మోసపూరితంగా అడ్వకేట్లుగా నమోదు చేసుకున్న తొమ్మిది మంది న్యాయవాదులను కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేసింది. వీరిలో ఎనిమిది మంది ఫోర్జరీ పత్రాలు సమర్పించగా, ఒకరు సమాచారం దాచిపెట్టారు. న్యాయ వృత్తి సమగ్రతను కాపాడటానికే ఈ చర్య తీసుకున్నామని బార్ కౌన్సిల్ కార్యదర్శి నాగలక్ష్మి తెలిపారు. ఈ నిర్ణయం న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పెంచి, నైతిక విలువలకు ప్రాధాన్యతను ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Entire Article