సింగరేణి బాయి బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకులంట్ల కవిత కొత్తగూడెంలోని పీవీకే 5 గనిలోకి వెళ్లి కార్మికులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకొని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్ బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ. 1400 కోట్లు క్విడ్ ప్రో క్రో ద్వారా ఏపీ కాంట్రాక్టర్ల నుంచి వచ్చినవేనన్న కవిత.. ఆ సొమ్మును అమర వీరుల కుటుంబాలకు పంచాలని డిమాండ్ చేశారు.