ప్రయాణికుడి తిక్క కుదిర్చిన హైదరాబాద్ మెట్రో.. అలా కూర్చున్నందుకు ఫైన్, పోలీస్ కేసు నమోదు

1 day ago 2
నాగోల్‌ నుంచి రాయదుర్గం వెళ్లే హైదరాబాద్‌ మెట్రో రైలులో పౌరస్పృహ లేకుండా ప్రవర్తించిన చైతన్య అనే ప్రయాణికుడిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కిటికీ అద్దంపై కాలు పెట్టి కూర్చోవడమే కాకుండా, తోటి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తంచేసినా వినకుండా వాదనకు దిగిన అతనికి మెట్రోరైలు చట్టం ప్రకారం రూ.250 జరిమానా విధించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు సదరు ప్రయాణికుడి ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టారు.
Read Entire Article