ప్రమాదవశాత్తూ మూసీ నదిలో పడిపోయిన ఓ మహిళను హైడ్రా సిబ్బంది కాపాడారు. భాగ్యనగర్ ప్రాంతానికి చెందిన ఇందిర అనే మహిళ శుక్రవారం రాత్రి కాలు జారి మూసీ నదిలో పడిపోయింది. అక్కడి నుంచి బయటకు రాలేక రాత్రంతా అక్కడే ఉండిపోయింది, శనివారం ఉదయం పది గంటల సమయంలో ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు హైడ్రా సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న హైడ్రా సిబ్బంది.. మహిళను కాపాడి కుటుంబసభ్యులకు అప్పగించారు.