Mla Bode Prasad Warned Rtc Bus Driver: కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆర్టీసీ బస్సు డ్రైవర్పై సీరియస్ అయ్యారు. పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంపై ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మండిపడ్డారు. కంకిపాడు కూడలిలో బస్సు ఆపకపోవడాన్ని బోడె ప్రసాద్ చూశారు. వెంటనే బస్సును ఆపి డ్రైవర్, కండక్టర్పై ఆగ్రహ వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్ని ప్రయాణికులు ఉన్నచోట బస్సు ఆపాలన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావొద్దన్నారు.