తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2769 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించేందుకు అనుమతించింది. ప్రతి పాఠశాలకు రూ. లక్ష మౌలిక వసతుల నిధిని కేటాయించడంతో పాటు ప్రత్యేక ఇన్స్ట్రక్టర్లను నియమించాలని కలెక్టర్లను ఆదేశించింది. ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల భారం నుంచి తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించడం, ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.