Somu Veerraju Switches To Electric Car: ప్రధాని మోదీ పిలుపుతో ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాజకీయ నేతలు పొదుపు బాటపట్టారు. ఇంధన పొదుపు కోసం కాన్వాయ్లో వాహనాలు తగ్గించుకున్నారు. కానీ ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కాస్త భిన్నంగా ఆలోచించారు. ఇంధనం పొదుపు చేసేందుకు డీజిల్, పెట్రోల్ కార్లను పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ కార్ల స్థానంలో కొత్తగా ఓ ఎలక్ట్రిక్ కారును కొనగోలు చేశారు.