తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రోలు బంకులను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెర్ప్ ఆధ్వర్యంలో చమురు సంస్థల సహకారంతో 39 ప్రాంతాల్లో లీజులు, ఎన్వోసీల ప్రక్రియ వేగంగా సాగుతోంది. మరోవైపు సోమవారం నుంచి మే 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా మహిళా సంఘ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. వారం రోజుల పాటు ఇందిరా మహిళాశక్తి భవనాలు, సోలార్ ప్లాంట్ల స్థాపన, మహిళా భద్రతపై అవగాహన వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.