ప్రతి ఇంటికీ రూ.5 లకే 20 లీటర్ల మినరల్ వాటర్.. మాట నిలబెట్టుకున్న నూతన సర్పంచ్..

5 months ago 15
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె గ్రామ సర్పంచ్ ఆత్మకూరు జ్యోతి వినూత్నంగా ప్రతి ఇంటికి కేవలం రూ. 5లకే మినరల్ వాటర్ అందిస్తున్నారు. ఎన్నికల హామీని నెరవేరుస్తూ ప్రైవేట్ ప్లాంట్ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకుని.. వాటర్ బబుల్ అసలు ధర రూ. 10లో సగం వాటాను సర్పంచ్ తన సొంత నిధుల నుండి భరిస్తున్నారు. దీనివల్ల గ్రామంలోని పేదలకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా.. స్వచ్ఛమైన నీటి ద్వారా ఆరోగ్య భద్రత లభిస్తుంది. అంతేకాకుండా.. గ్రామంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం రూ. 5 వేల ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు. నూతన సంవత్సర కానుకగా ప్రారంభమైన ఈ పథకం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article