ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ వరకు ఎలివేటెడ్ కారిడార్.. రూ.2,232 కోట్లతో..

8 months ago 15
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ప్యారడైజ్-శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. రూ.2,232 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి 90 శాతం మేర భూసేకరణ పూర్తవగా, రక్షణ శాఖ భూములు ఇచ్చేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. నవంబర్ నెలాఖరు నాటికి పనులు మొదలుపెట్టేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇది నగర ట్రాఫిక్‌ సమస్యను గణనీయంగా తగ్గిస్తుంది అని అభిప్రాయపడుతున్నారు.
Read Entire Article