శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు సామాన్య ప్రజల పట్ల ప్రవర్తించే తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కరీంనగర్లో ఒక ఎస్సై సెలూన్ షాపుకు వెళ్లగా.. అక్కడ పనిచేసే వ్యక్తి సాన్నిహిత్యంతో 'కూర్చో అన్నా' అని పలకరించినందుకు సదరు అధికారి విచక్షణ కోల్పోయి దాడికి దిగడం పెద్ద దుమారం రేపింది. తాజాగా..హైదరాబాద్ పాతబస్తీలో మరో ఎస్సై రాత్రిపూట తనిఖీల్లో భాగంగా తనను 'అన్నా' అని సంబోధించిన యువకుడిపై ఫైరయ్యాడు. ఈ నేపథ్యంలో పోలీసులను 'సార్' అని మాత్రమే పిలవాలా? అన్నా అంటే నేరమా? అన్న చర్చ మొదలైంది.