పోలవరం జిల్లా దేవీపట్నం మండలం నేలకోట ప్రాంతంలో పెద్ద పులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులిని బంధించేందు అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అటవీశాఖ ప్రత్యేక రెస్క్యూ బృందాలు, ట్రాంక్విలైజేషన్ బృందాలు, డ్రోన్ బృందాలు కూడా పులిని పట్టుకునేందుకు పనిచేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా ఎవ్వరూ అడవిలోకి వెళ్లే ప్రయత్నం చేయొద్దని చెప్పారు. పెద్ద పులి పట్టుబడే వరకూ ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ప్రజలకు వాళ్లు భరోసా ఇచ్చారు.