తెలంగాణలో పోక్సో చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పోక్సో కేసుల్లో వేగంగా దర్యాప్తు, బాధితులకు రక్షణ, సాక్ష్యాల భద్రత, ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు వంటి కీలక సూచనలు చేశారు. పోక్సో కేసుల్లో కఠిన చర్యలు, బెయిల్ విషయంలో జాగ్రత్తలు, నిందితులపై రౌడీషీట్లు, పాఠశాలలు-ప్రార్థనా మందిరాల్లో భద్రతా ప్రోటోకాల్స్ అమలు చేయాలని కోరుతూ 30 రోజుల్లో కార్యాచరణ నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.