పెళ్లైన నెల రోజులకే శవమై తేలిన యువకుడు.. గద్వాలలో 'మేఘాలయ' తరహా దారుణం

11 months ago 16
మేఘాలయ హనీమూన్ ఘటనను గుర్తుచేసేలా జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన నెల రోజులకే తేజేశ్వర్ అనే నవవరుడు అదృశ్యమై, ఐదు రోజుల తర్వాత శవమై తేలాడు. నంద్యాల జిల్లా పిన్నాపురం శివారులో హత్యకు గురయ్యాడు. తేజేశ్వర్‌కు మే 18న కర్నూలు యువతితో ప్రేమ వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు తేజేశ్వర్ భార్యపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు పెళ్లికి ముందు ఇతర సంబంధాలు ఉండేవని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article