పెళ్లై నెల తిరగకుండానే.. అత్తగారింటికి వెళ్లే ముందు పెళ్లికూతురు కఠిన నిర్ణయం..

2 months ago 12
అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తాడిపత్రిలో ఓ ఫిజియోథెరపిస్టు ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మీ ప్రసన్న అనే యువతి తాడిపత్రి ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నారు. లక్ష్మీప్రసన్నకు గత నెలలోనే పెళ్లి జరిగింది. బుధవారం రోజున కర్ణాటక కోలార్ జిల్లాలోని అత్తారింటికి బయల్దేరాల్సి ఉండగా.. లక్ష్మీ ప్రసన్న ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. డిప్రెషన్ కారణంగా పెళ్లికి ముందు కూడా లక్ష్మీప్రసన్న ఆత్మహత్యకు యత్నించారు. అయితే తల్లిదండ్రులు కాపాడారు. ఆత్మహత్య ఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Read Entire Article