ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి, వాటిని బలోపేతం చేసేందుకు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక లేదా ఉన్నత పాఠశాలలో తమ పిల్లలను చేర్పించే తల్లిదండ్రులకు ఇంటి పన్ను, నల్లా బిల్లుల నుంచి పూర్తి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. సర్పంచ్ వేముల శ్రీకాంత్ నేతృత్వంలోని పాలకవర్గం ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ ఆఫర్ ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం ముగిసే వరకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.