తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలలకే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్.. రాజకీయాల్లో నిజాయతీకి పట్టం కట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అవినీతికి పాల్పడితే ఆయన ఏమాత్రం సహించేవారు కాదు. ఓసారి ముద్రగడ పద్మనాభం ప్రలోభాలకు గురయ్యారని ఎవరో తప్పుడు సమాచారం ఇస్తే.. ఎన్టీఆర్ ఆయన్ను పిలిచి మాట్లాడబోయారు. కానీ యువకుడైన ముద్రగడ ఎన్టీఆర్పైనే ఎగిరి పడ్డారు. దీంతో ముద్రగడ అవినీతి గురించి ఆరా తీసిన ఎన్టీఆర్ ఆయన ఏ తప్పు చేయలేదని తెలుసుకొని మంత్రి పదవి ఇచ్చారు.