పింఛన్ల పంపిణీలో ఆలస్యానికి చెక్.. సమస్యలకు ఫుల్ స్టాప్.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..

10 months ago 18
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం కింద 11 రకాల పింఛన్లు అందజేస్తోంది. అయితే చాలా మంది లబ్ధిదారులకు ఫింగర్ ప్రింట్ సరిగా పడకపోవడంతో పింఛన్లు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, కూలీలు, రైతుల వేలిముద్రలు చెరిగిపోవడంతో ధృవీకరణ విఫలమవుతోంది. దీంతో పింఛన్ ఆగిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం ఇటీవల ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను ప్రవేశపెట్టింది. అదనంగా.. కొత్తగా పోస్టుమాస్టర్లకు ఆధునిక ఫింగర్ ప్రింట్ పరికరాలు, 5జీ స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
Read Entire Article