పార్టీ పేరుపై కీలక వ్యాఖ్యలు చేసిన కవిత.. ఫైనల్ చేసేది వారే..

5 months ago 14
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, 2029 ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని.. పార్టీకి మాత్రం ప్రజలు సూచించిన పేరును మాత్రమే పెడతామన్నారు. 'ఆస్క్ కవిత' ఇంటరాక్షన్‌లో పాల్గొన్న ఆమె, యువతకు ఉద్యోగాలు కల్పించడమే తన ప్రథమ ప్రాధాన్యమన్నారు. కాంగ్రెస్ పాలన హామీలను నెరవేర్చడంలో 'అట్టర్ ఫ్లాప్' అయ్యిందని.. ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు ఆత్మహత్యలు, సింగరేణి నిర్లక్ష్యంపై ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వ్యక్తిగత అంశాల్లో, తాను చిరంజీవి అభిమానిని అని తెలిపారు.
Read Entire Article