Vijayasai Reddy Request for Tirupati Railway Division: తిరుపతి కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. తిరుపతిని ఏటా కోట్లాదిమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారని.. ప్రయాణికుల నిర్వహణ, భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తిరుపతి కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రిని కోరారు. మరోవైపు తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది.