ప్రధాని మోదీ హైదరాబాద్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు హైదరాబాద్ వచ్చిన మోదీ.. కార్యక్రమం పూర్తైన అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు, జూబ్లీహిల్స్లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీ.. ఇటీవల సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు.