యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారంపై మాజీ ఐపీఎస్ ఆఫీసర్ పీవీ సునీల్ కుమార్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రశ్న రావణ్ వ్యాఖ్యలపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు.. అక్కడితో సరిపోయిందని.. వరుస కేసులు పెట్టడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ప్రశ్న రావణ్ పోలీస్ స్టేషన్లో ఉన్న సమయంలో అతనిపై దాడి చేసేందుకు వెళ్లిన మూక ఎవరో తేల్చాలని.. వారిపైనా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. వాళ్లు జనసేన కార్యకర్తలై ఉండరన్న పీవీ సునీల్ కుమార్.. పవన్ కళ్యాణ్ అలాంటివి ప్రోత్సహించరని చెప్పుకొచ్చారు.