జనసేన పార్టీకి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్లో సభ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో.. హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడా ఊరట లభించలేదు. దీంతో సభ సాగడం దాదాపుగా అసాధ్యంగా మారింది. మరోవైపు.. పోలీసులు సభకు అనుమతి ఇవ్వకపోవడం, హైకోర్టులో వ్యతిరేకంగా నిర్ణయం రావడంతో.. హైదరాబాద్లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించేందుకు జనసేనాని రెడీ అవుతున్నారు.