ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ప్రశంసలు కురిపించారు. తిరుపతి పళని బస్సు సర్వీసులను ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. చిరకాల కోరికను నెరవేర్చారని ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన ఎప్పుడూ ముందుంటారన్న అన్నామలై.. ప్రజలను ఆయన తన కుటుంబసభ్యులుగా భావిస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.