హనుమకొండకు చెందిన పవన్ కల్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) మృతి చెందాడు. అరుదైన జన్యు సంబధింత వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ ఇవాళ ఉదయం కన్నుమూశాడు. గత నెలలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శించటంతో పాటు రూ. 1 లక్ష సాయం అందించాడు. OG-2 సినిమా కలిసి చూద్దామని మాట ఇచ్చారు. పవన్ స్ఫూర్తితో నిర్మాత బండ్ల గణేష్ కూడా రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేశారు. కాగా, పవన్ కల్యాణ్ను కలిసిన కొద్ది రోజులకే నిరంజన్ కన్నుమూయటం తీవ్ర విషాదాన్ని నింపింది.