పల్నాడు: మొగుడి మీద ఎంత కోపం వస్తే మాత్రం.. మరీ ఇలాంటి పనేంటమ్మాయ్?

1 year ago 22
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. 28 ఏళ్ల ఓ వివాహిత భర్తపై కోపంతో ఏకంగా నాలుగు పెన్నులు మింగేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ల్యాప్రోస్కోపి ద్వారా పెన్నులను తొలగించారు. సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాపాయం వాటిల్లేదని వైద్యులు తెలిపారు. భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణమైనప్పటికీ, ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం విడ్డూరంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Entire Article