పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. వారికి రూ.5 లక్షలు, వీరికి రూ.15 వేలు..

8 months ago 18
‘మొంథా’ తుపాను వల్ల తెలంగాణలోని 12 జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయన హనుమకొండ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. నష్టంపై నివేదికలు తక్షణమే సమీకరించి కేంద్రానికి పంపాలని, కేంద్ర నిధులు రాబట్టడంలో అలసత్వం వహించవద్దని అధికారులను హెచ్చరించారు. వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షలు, ఇళ్లు మునిగిన వారికి రూ. 15 వేలు చెల్లించనున్నారు. ఎకరా పంట నష్టానికి రూ. 10 వేలు , ఆవులు/గేదెలు మృతి చెందితే రూ. 50 వేలు, మేకలు/గొర్రెలకు రూ. 5 వేలు పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
Read Entire Article