పరవాడ ఫార్మా కంపెనీ ప్రమాదం.. మూడుకు చేరిన మృతుల సంఖ్య

1 year ago 43
Parawada Pharma City Fire Accident: అనకాపల్లి జిల్లా పరవాడ సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ యూనిట్‌-3లో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 3కు చేరింది. ఇవాళ తెల్లవారుజామున విశాఖలోని ఇండస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయనగరం జిల్లాకు చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహాన్ని కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు. ఇప్పటికే ఇదే ప్రమాదంలో గాయపడిన జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు చనిపోయారు.. మరొకరు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురికి గాయాలు అయ్యాయి.
Read Entire Article