పట్నా ఐఐటీ క్యాంపస్ శనివారం విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతున్న సమయంలో స్తంభాన్ని తాకటంతో.. కరెంట్ షాక్ కొట్టి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన విద్యార్థిని హైదరాబాద్కు చెందిన హర్షిత్ రాజ్గా గుర్తించారు. చందానగర్కు చెందిన హర్షిత్ రాజ్.. పట్నా ఐఐటీలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నారు. హర్షిత్ రాజ్ మరణవార్త తెలిసి అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.