పక్కింటోళ్లు బైక్ కొన్నారని.. ఇలాంటి పనా? డాక్టర్లే బిత్తరపోయారుగా!

1 year ago 25
పల్నాడు జిల్లా నరసరావుపేటలో అనూహ్య ఘటన జరిగింది. బైక్ కొనివ్వలేదనే కోపంతో ఓ యువకుడు తాళం చెవులు మింగేశాడు. కడుపునొప్పి రావటంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బుధవారం సాయంత్రం యువకుడికి స్కానింగ్ తీసిన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు..కడుపులో తాళం చెవులు ఉన్నట్లు గుర్తించారు. గురువారం ఉదయం ల్యాప్రోస్కోపీ ద్వారా సర్జరీ అవసరం లేకుండానే నాలుగు తాళం చెవులను బయటకు తీశారు. అయితే బైక్ కొనివ్వలేదనే కారణంతో తాళం చెవులు మింగిన విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
Read Entire Article