మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి చేపట్టిన సాహసోపేతమైన స్టింగ్ ఆపరేషన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల అర్ధరాత్రి వేళ సాధారణ మహిళగా రోడ్డుపై నిలబడి వేధింపులకు పాల్పడుతున్న 40 మంది పోకిరీలను పట్టుకున్నారు. గతంలోనూ తన ప్రాణాలకు తెగించి హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలను ఎలా మట్టుబెట్టారో ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్తో పంచుకున్నారు. పోలీసు డ్రెస్సులో మాత్రమే కాకుండా.. సాధారణ పౌరురాలిగా మారి నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న ఈ ఐపీఎస్ అధికారిణి ప్రస్థానం నేటి యువతకు నిజంగా స్ఫూర్తిదాయకం.