వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో పర్యటించారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బాధితులకు ప్రకటించిన పరిహారం వారికి హక్కుగా అందేందన్న జగన్.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇచ్చింది లేదని విమర్శించారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ను ఉద్దేశిస్తూ నువ్వు ఇచ్చింది ఏందయ్యా బోడి అంటూ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.