నిర్మల్‌: ఫ్రిడ్జ్ పేలి ఇద్దరు మృతి.. వేసవిలో ఫ్రిడ్జ్‌లు, ఏసీలు ఎందుకు పేలుతాయి..?

2 months ago 14
నిర్మల్ జిల్లా బంగల్‌పేట్‌లో ఫ్రిడ్జ్ పేలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా రిఫ్రిజిరేటర్ పేలడంతో తీవ్రంగా గాయపడిన యజమాని విజయ్ సహా.. మరో మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కంప్రెషర్లు వేడెక్కడం, వోల్టేజ్ సమస్యలే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సరైన సర్వీసింగ్, వెంటిలేషన్, నాణ్యమైన ఎలక్ట్రికల్ పరికరాలను వాడటం ద్వారా ఇలాంటి ప్రాణాపాయ సంఘటనలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Read Entire Article