అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధ పడుతూ.. పవన్ కళ్యాణ్ అభిమాని అయిన 17 ఏళ్ల పొనుగంటి నిరంజన్ హైదరాబాద్లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడు. గత నెలలోనే పవన్ కళ్యాణ్ నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శించి.. ‘ఓజీ 2’ సినిమాకు స్పెషల్ గెస్ట్గా పిలుస్తానని మాట ఇచ్చారు. అంతలోనే నిరంజన్ మరణించడంతో.. అంతా దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిరంజన్ మృతిపై నటుడు సోనూసూద్ కూడా స్పందించారు. బాధిత కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి మరీ మాట్లాడారు. నిరంజన్ మృతి పట్ల సంతాపం తెలపడమే కాకుండా భవిష్యత్తులో మీకు ఏ సమస్య వచ్చినా నేను తోడుంటానని చెప్పారు.